మంచు మనోజ్ నటించిన హై వోల్టేజ్ ‘కరెంటుతీగ’ దసరాకు సందడి చేస్తుందని స్వయంగా మంచు కుటుంబం ప్రకటించడంతో దసరాకు మంచు, మెగా కుటుంబాల సినిమాల పోటీ ఉంటుంది అనుకున్నారు అంతా. సన్నీలియోన్ క్రేజ్ ను కాసులుగా మార్చుకుని మాస్ హీరోగా నిలదొక్కుకుందామని మనోజ్ ఈ సినిమా ద్వారా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై మంచు కుటుంబం చాల ఆసలు పెట్టుకుంది. ఈమధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సరైన స్పందన రాకపోవడంతో ‘కరెంటు తీగ’ లో కరెంటు లేదా అంటూ కొందరు సెటైర్లు కూడా మొదలు పెట్టారు. ఈవిషయాలన్నీ మంచు వారి వరకు వెళ్ళాయి కాబోలు రామ్ చరణ్ గోవిందుడు తో పోటీగా విడుదల అవుతుంది అనుకున్న ‘కరెంటు తీగ’ ఒక వారం గ్యాప్ తీసుకుని దసరా పండుగ హడావిడి అయిన తరువాత నెమ్మదిగా ధియేటర్లలో సందడి చేస్తుంది అనే వార్తలు ఫిలింనగర్ హడావిడి చేస్తున్నాయి. ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ‘ఆగడు’ సక్సస్ కాకపోవడంతో ‘గోవిందుడు అందరివాడేలే’ పై అంచనాలు విపరీతంగా పెరిగి పోవడంతో ఎందుకైనా మంచిదని వ్యూహాత్మకంగా మంచు కుటుంబం ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవాలి. ఏమైనా ‘ఆగడు’ పరాజయం టాలీవుడ్ లో చాలామందికి పాఠాలు నేర్పుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: