గతవారం విడుదల అయిన ‘ఆగడు’ సినిమా పై నడుస్తున్న విపరీతమైన నెగిటివ్ ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి స్వయంగా శ్రీనువైట్ల రంగంలోకి దిగాడు. ఈరోజు ఉదయం జరిగిన ప్రెస్ మీట్ లో శ్రీనువైట్ల ‘ఆగడు’ పై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లుగా మీడియా లో  వార్తలు వస్తున్నాయి.  ‘ఆగడు’ ఫెయిల్ అయింది అని ప్రచారం చేస్తున్న విమర్శకులకు సమాధానం ఇస్తూ దసరా సెలవులు పూర్తి అయ్యేదాకా కాస్త ఓపిక పడితే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వాస్తవాలు బయటకు వస్తాయాని అంటూ విడుదల అయి వారం కూడా పూర్తికాని సినిమా ఫెయిల్ అని ఎలా నిర్ణయిస్తారు అని తన పై విమర్శలు చేస్తున్న వారి పై సెటైర్లు వేసారు శ్రీనువైట్ల.  వరస పెట్టి పోలీసు సినిమాలు లైన్ గా రావడంతో ‘ఆగడు’ విషయంలో డివైడ్ టాక్ వచ్చిందని అభిప్రాయ పడ్డాడు శ్రీనువైట్ల. అంతేకాదు ఆగడు రిజల్ట్ పై తనకు కాని, మహేష్ కు కాని ఎటువంటి అసంతృప్తి లేదని మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ నిరాధారాలు అంటూ కొట్టివేసాడు శ్రీనువైట్ల.  ‘ఆగడు’, ‘దూకుడు’ కు సీక్వెల్ గా ఉంది అన్న విమర్శల పై స్పందిస్తూ తాను దర్సకత్వం వహించిన ‘ఆగడు’ పై ‘దూకుడు’ ఛాయలు ఉన్నంత మాత్రాన తాను మిగితావారి సినిమాల నుండి కాపీ కొట్టలేదు కదా అని శ్రీనువైట్ల చెపుతున్న వితండ వాదం పక్కకు పెడితే దసరా ముగిసే సరికి ఇరు రాష్ట్రాలలోను ఎన్ని ధియేటర్లలో ‘ఆగడు’ ఉంటుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: