‘జబర్ధస్త్’ ప్రోగ్రాంతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అనసూయ క్రేజ్ బుల్లితెర పై బాగానే నడుస్తోంది. అయితే ఆమెకు మాత్రం వెండి తెరను ఏలాలి అనే కోరిక. ఆ మధ్య ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక పాత్ర ఆమెకు వస్తే దానిని ప్రాధాన్యత లేని పాత్ర అని తిరస్కరించి ఆ తరువాత బాధ పడి ఇప్పుడు సినిమా అవకాశాల కోసం రకరకాల ఫోటో షూట్లు ఇస్తూ నిర్మాతలను ఆదరగోడుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఆడియో ఫంక్షన్స్ లో తళుక్ మంటున్నా సినిమా ఛాన్స్ ల కోసం ఈమె చేస్తున్న ప్రయత్నాలు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఇటీవల రోజా ఎగ్జిట్ కారణంగా మోడ్రన్ మహాలక్ష్మీ షోను చేజిక్కించుకున్న అనసూయ మరో సంచలనం చేయబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు దేవి నవరాత్రులలో ప్రసారం అవుతున్న ‘మోడ్రన్ మహాలక్ష్మి’ షో కార్యక్రమాలలో ఈ తొమ్మిది రోజులు నాలుగు కోట్ల విలువచేసే బంగారు, వజ్రాల ఆభరణాలతో నిజమైన మహాలక్ష్మిగా అనసూయ చేస్తున్న హడావిడి బుల్లితెరకు సంచలనంగా మారింది. ఏమైనా ఈ దసరా రోజులలో వెండితెర పై రాణించాలి అన్న అనసూయ కోరిక తీరే అవకాశాలు వస్తాయేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: