బాలీవుడ్ లో అదేవిధంగా టాలీవుడ్ లో అనేకమంది పేరున్న హీరోయిన్స్ ఇప్పటికే చాలా సినిమాలలో ఐటమ్ గర్ల్స్ గా మారిపోయినా త్రిష మాత్రం తన బింకాన్ని కొనసాగిస్తూ ఇంకా తాను టాప్ హీరోయిన్ లిస్టులో ఉన్నాను అనేటట్లుగా ఈ చెన్నై బ్యూటీ ప్రవర్తిస్తూ ఉంటుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించాలని ప్రతి టాప్ హీరోయిన్ కోరుకుంటూనే ఉంటుంది. త్రిషకు కూడా తనకు రజినీతో నటించాలని ఉంది అనే ఉద్దేశ్యాన్ని చాలాసార్లు బహిరంగంగానే బయట పెట్టింది. అయితే కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ‘లింగా’లో త్రిష రజినీతో ఐటమ్ సాంగ్ చేసిందని వార్తలు ఊపు అందుకున్నాయి.
అంతేకాదు కోలీవుడ్ మీడియా వార్తల ప్రకారం ఇప్పటికే ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది అనే వార్తలు రాస్తోంది. పలు వెబ్సైట్స్లో ఈ వార్త గతంలోనే హల్చల్ చేసింది. అయితే ఇదే విషయం పై త్రిష వివరణ ఇచ్చింది. ‘‘సూపర్స్టార్తో నర్తించడమంటే నిజంగా అదృష్టమే. అయితే అటువటి ప్రపోజల్ ఏదీ నా దగ్గరకు రాలేదు. నేను ‘లింగా’లో ఐటమ్ సాంగ్ చేస్తున్నానని వస్తున్న వార్త ఇప్పటికైతే కరెక్ట్ కాదు’’ అని చెప్పి తప్పించుకుంది.
త్రిష మాటలకు మీడియా వేరే అర్ధాలు తీస్తూ ‘లింగా’ లో ఐటమ్ సాంగ్ చేయడానికి తనకు అభ్యంతరంలేదు అంటూ త్రిష సందేశాలు పంపుతోంది కాబట్టి త్రిష ఐటమ్ గర్ల్ గా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని వ్యాఖ్యానాలు రాస్తోంది మీడియా. అయితే ఈ చెన్నై బ్యూటీని ఐటమ్ గర్ల్ గా ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్నదే ప్రశ్న.
మరింత సమాచారం తెలుసుకోండి: