టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డంని క్రియోట్ చేసుకున్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు నటిస్తున్న ప్రతి చిత్రం, బాక్సాపీస్ వద్ద ఓ రేంజ్ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంటే, మరో వైపు కార్పోరేట్ ఇన్వెస్టర్స్ కూడ మహేష్ బాబు మూవీని డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మహేష్ బాబు మూవీకి పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి రావడమే కాకుండా, నిర్మాతకి లాభాలని తెచ్చి పెడుతుంది. దీంతో ఇప్పుడు బడా నిర్మాతలందరూ మహేష్ బాబు కాల్షీట్స్ కోసం తెగ ప్రతయ్నాలు మొదలుపెడుతున్నారు. ఆ విధంగా 'జులాయి', 'నాయక్' లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య మహేష్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహేష్ బాబు డేట్స్ కోసం దానయ్య సుమారు 22 కోట్ల రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు మహేష్ బాబు ఒప్పుకుంటే దాదాపు సగం అమౌంట్ ని అడ్వాన్స్డ్ గా ఇచ్చేందుకు నిర్మాత రెడీ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మహేష్ బాబు హీరోగా ఈ చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో నిర్మించాలనుకుంటున్నాడని నిర్మాత దానయ్య ఆలోచనగా తెలుస్తుంది. అయితే, నిర్మాత ఆఫర్ ఇచ్చాడు కాని, మహేష్ మాత్రం ఈ ఆఫర్ కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ప్రిన్స్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీని తర్వాత, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించే చిత్రంలో మహేష్ బాబు నటించనున్నాడు. వినాయక్ చెప్పే కథ నచ్చితే, ప్రిన్స్ ఆ నిర్మాతకి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబు మార్కెట్ టాలీవుడ్ లో అందరి కంటే హైయస్ట్ రెమ్యునరేషన్ అని తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: