మెగా అభిమానులు ఎప్పటినుంచో కోరుకునే దృశ్యానికి వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ముకుంద’ ఆడియో వేడుక వేదిక కాబోతోంది అనే వార్తలు చాలా గట్టిగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. దసరా పండుగకు రెండు రోజుల ముందే మెగా అభిమానుల అంచనాలను పెంచేస్తూ 'గోవిందుడు' థియేటర్స్‌ లోకి వస్తుంటే, ఈ జోష్ కు మరో బోనస్ గా దసరా పండుగ మరునాడు నాగబాబు తనయుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ముకుంద’ ఆడియో వేడుక అక్టోబర్4న చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తునాయి.  అయితే వినపడుతున్న వార్తలు ప్రకారం ఈ ఆడియో వేడుకలో మెగా అభిమానులకు కిక్ ఇచ్చే విధంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కనిపించి సందడి చేయనున్నారని వార్తల హడావిడి ఫిలింనగర్ లో గట్టిగ జరుగుతోంది. ఈ వేడుకకు అతిధులుగా వచ్చే విషయంలో మెగా బ్రదర్ నాగబాబు చిరంజీవి పవన్ ల అంగీకారాన్ని ఇప్పటికే తీసుకున్నాడు అని టాక్. ఈ వార్తలే నిజం అయితే చాలాకాలం నుండి ఎడ మొఖం పెడ మొఖంగా ఉన్న అన్నదమ్ములను కలిపిన ఆడియో వేడుకగా ‘ముకుందుడు’ రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఈ వార్తలు ఇలా ఉండగా రిలీజ్ కాకుండా నే పాజిటివ్ టాక్ తో ఉన్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుని 60 కోట్లు వసూలు చేయగలిగితే రామ్ చరణ్ ఈ సంవత్సరం విడుదలైన తన ‘ఎవడు’ తో కలిపి ఒకే సంవత్సరంలో రెండు హిట్స్ ను సాధించడమే కాకుండా రెండు సినిమాలకు కలిపి 100 కోట్ల మార్క్ ను అందుకున్న తొలి మెగా హీరో అవుతాడు అనే విశ్లేషణలు గట్టిగ వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ దసరా మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చే పండుగలాగానే కనిపిస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: