సూపర్ స్టార్ చెప్పే మాటకు ఆయన అభిమానులు ఎంతో విలువ ఇస్తారు. అందుకే ఆయనను రాజకీయాలలోకి రమ్మని అన్ని పార్టీలు పిలుస్తున్నాయి. అటువంటి టాప్ క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజినీ గొంతును త్వరలో దక్షణ భారతదేసంలోని అన్ని రైల్వే స్టేషన్స్ లోను వినబోతున్నాం. ఈమధ్య చాల రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్ లు దాటుతూ ఉంటె చాలామంది ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి భారతీయ రైల్వేస్ రజనీకాంత్ వాయిస్ ను వాడుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ లపై పాదచారులను రైలు పట్టాల పై నడవ వద్దని రైల్వే వంతెన ఎక్కి వెళ్ళవలసిందిగా రజినీ గొంతుతో వాయిస్ ను అన్ని భాషలలో రికార్డ్ చేసి రైల్వే స్టేషన్ లలో వినిపించే ప్రయోగం రైల్వే శాఖ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మంచి ప్రయత్నానికి రజినీ కూడ తన అంగీకారాన్ని తెలియ చేసాడు అని టాక్. తన సెలిబ్రెటీ స్టేటస్ ను ఒక మంచి పనికి రజినీ వినియోగిస్తున్నందులకు అభినందించాలి. రజినీ మాటవిని అయినా జనం మారుతారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: