ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం డైలమాలో ఉన్నాడు. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ఆగడు మూవీ, దూకూడు సీక్వెల్ అనే కంటే, గబ్బర్ సీక్వెల్ అంటే బెటర్ ఏమో అన్న అభిప్రాయాన్ని సాధారణ సినీ ప్రేక్షకుల్లో సైతం కలుగజేస్తుంది. దీంతో 'ఆగడు' సినిమా మహేష్ బాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆగడు మూవీ విషయంలో కథ కంటే దర్శకుడు శ్రీను వైట్లపైనే ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. దీంతో కథని పక్కన పెట్టి, శ్రీను వైట్ల చెప్పే ప్రతీ సీన్ ని ఎటువంటి రిమార్క్ లేకుండా నటించేశాడు. తీరా మూవీ అవుట్ పుట్ చూసి అవాక్కవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు కథకే ప్రాధాన్యతనివ్వాలని మహేష్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుందన్నది తెలిసిన విషయమే. ముందుగా ఈ సినిమా అక్టోబర్ 5న మొదలుకానుంది అని తెలిపినా ఇప్పుడు ఆ డేట్ వాయిదాపడింది. దీంతో అనుకున్న డేట్ కి షూటింగ్ స్టార్ట్ కాలేకపోయోసరికి దర్శకుడు కొంత కన్ ఫ్యూజ్ కి గురికావాల్సిన పరిస్థితి వచ్చింది. కథలో కొద్దిగా ఛేంజెస్ కావాలని, కొన్నింటిని మార్పులు చేర్పులు చేయాలని మహేష్ బాబు, కొరటాలకి సూచించాడు. అందుకే మూవీకి సంబంధించిన షూటింగ్ డేట్ కొద్దిగా దూరం జరిగింది. దీంతో కొరటాల శివతో చేసే సినిమా కథ పట్ల మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. కథ పక్కాగా అనిపిస్తేనే ముందుకు వెళుతున్నాడు. మహేష్ మార్పుల ప్రకారం ఈ మూవీ ఇప్పుడు అక్టోబర్ 9 నుంచి షూటింగ్ నిర్వహిస్తారట. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మరోసారి దర్శకులని గుడ్డిగా నమ్మకుడని ప్రిన్స్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆగడు మూవీకి సీక్వెల్ ఉంటుందనే ప్రపోజల్ ప్రిన్స్ వద్దకు వస్తే దాన్ని సున్నితంగా తిరస్కరించాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: