టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ తో ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మెగా హీరో, రామ్ చరణ్. రామ్ చరణ్ మూవీ అంటే మెగా హీరోలకే కాకుండా, సినీ ప్రేక్షకులకి పండుగ వాతావరణమే. తను తాజాగా నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే మూవీ దసరా ఫెస్టివల్ కానుకగా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ వాడిన ఖరీదైన బైకుని ప్రేక్షకుల కోసం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట చిత్ర నిర్మాత. ఇందుకు మెగాభిమనుల కోసం 'గోవిందుడు అందరివాడేలే 'చిత్రం మీద ఓ మెగా కాంటెస్ట్ పెడుతున్నామని నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించాడు. 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో హీరో రాంచరణ్ కోసం 17 లక్షలు పెట్టి ఓ ఖరీదైన ఇంపోర్టెడ్ బైక్ కొన్నామని, ఆ బైక్ చాలా బాగుండడంతో ముందుగా తనే దగ్గరే ఉంచుకోవాలని భావించానని ఆయన తెలిపారు. రామ్ చరణ్ బైక్ ని సొంతం చేసుకునేందుకు మనీని కూడ బండ్ల గణేష్ కి ఇవ్వటానికి సిద్దమైపోయాడు. అయితే చివరి నిముషంలో రామ్ చరణ్ ని నిర్మాత బండ్ల గణేష్ ఆశ్ఛర్యపరిచాడు. మెగా అభిమానులకి గిప్ట్ గా, ఈ బైక్ ని వారికి ఉచితంగా అందిస్తానని చెప్పాడట. అందుకు రామ్ చరణ్ కూడ హ్యాపీగా ఫీల్ అయినట్టు ఇండస్ట్రీ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ 1న సినిమా రిలీజైన తర్వాత, 'గోవిందుడు అందరివాడేలే'కు సంబంధించిన ఓ ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారిలో విజేతను డ్రా ద్వారా ఎంపిక చేసి, విజేతని ప్రకటించి, ఆ బైకుని వారికి అందజేయటం జరుగుతుంది. దీనిని హీరో రాంచరణ్ చేతుల మీదుగా విజేతకు అందజేస్తామని ఆయన ప్రకటించారు.ఈ పోటీకి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: