పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో, అలాగే టాప్ డైరెక్టర్ టార్గెట్ చేసినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన టాక్స్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా వ్యక్తిగత విషయాల్లో కాదు. వృత్తి పరంగా పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల మూవీ విషయంలో. పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల మూవీ 2015 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అదే సమయంలో సంక్రాంతికి పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ల మధ్య రసవత్తర పోటీకి రంగం సిద్ధమయ్యింది. నిజానికి 2015 సంక్రాంతి బరిలో 'గోపాల గోపాల' చిత్రం మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ మూవీకి దరిదాపుల్లో ఏ చిత్రం కూడా పోటీలో లేదు. కానీ,తాజాగా ఎన్టీఆర్ కూడా సంక్రాంతి రేసులో బరిలో నిలవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేనో రకం' సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. గతంలో జూనియర్ నటించిన చిత్రాలు సాధించినంత సక్సెస్ ని చూడలేకపోవడంతో, ఈసారి తను నటిస్తున్న నేనో రకం ఫిల్మ్ ని బాక్సాపీస్ వద్ద సక్సెస్ గా నిలపాలని కోరుకుంటున్నాడు. అలాగే పూరీ జగన్నాధ్ సైతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న గోపాల గోపాల మూవీకి పోటీగా తన మూవీని బరిలోకి దించాలని కోరుకుంటున్నాడట. దీంతో జూనియర్, పూరీ లు కలిసి పవన్ మూవీకి ధీటుగా వారి మూవీని 2015 సంక్రాంతి పండుగ బరిలోకి దించనున్నారు. ఇప్పటికే పూరీ, జూనియర్ ల చిత్రం ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోను ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ లు పట్టుదలగా ఉన్నారని సమాచారం. టాలీవుడ్ లో అత్యంత వేగంతా సినిమాలు తీసేది పూరి జగన్నాథే. ఎన్టీఆర్ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఈ నేపధ్యంలో, ఈ చిత్రం కచ్చితంగా జనవరిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ బావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: