టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలతో గ్రాండ్ సక్సెస్ లని సాధిస్తూ ఫాంలో ఉన్న హీరో మహేష్ బాబు. ఇదిలా ఉంటే ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ఆగడు మూవీ, బాక్సాపీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ ఫుల్ గా టాక్ తెచ్చుకోలేకపోయింది. అందుకు కారణం, ఆగడు మూవీ కథ, పాత కథని పోలి ఉండటమే అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు వద్దకి ఓ బడా నిర్మాత వచ్చాడు. అయితే ఆ నిర్మాతకి తన కాల్షీట్స్ ఇవ్వకుండా, కనపడకుండా తప్పించుకునేంతగా మహేష్ ప్రయత్నిస్తున్నాడు. మహేష్ బాబుని అంతలా ఇబ్బంది పెడుతున్న నిర్మాతే బండ్ల గణేష్. బండ్ల గణేష్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీకి నిర్మాతగా ఉంటున్నాడు. ఈ మూవీ తరువాత ఆయనకు చిరంజీవి నటించే 150వ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని ఉన్నదని, అందుకు తన వంతుగా ప్రయత్నాలు చేశాడు. కాని చిరంజీవి,బండ్ల గణేష్ కోరికకు అడ్డు వేసి, ఆ ఛాన్స్ ని వేరొకరికి ఇచ్చేశాడు. దీంతో బండ్ల గణేష్ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టర్ మహేష్ బాబుకి బిస్కెట్ వేసే పనిలో ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అందుకోసం బండ్ల గణేష్ మహేష్ బాబుని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా సిద్ధం అవుతున్నాడు. గతంలో ఓ సారి మహేష్ బాబుని కలిసిన బండ్ల గణేష్, తన మాటలతో మహేష్ ని ఉక్కిరి బిక్కిరి చేశాడు. దీంతో మహేష్ బాబు, బండ్ల గణేష్ మాటలకి దాదాపు భయపడేంత పని అయిందట. బండ్ల గణేష్ కి ఎట్టి పరిస్థితుల్లో కాల్షీట్స్ ఇవ్వకుడదని, కొంత కాలం ఈ బడా నిర్మాతకి దూరంగా ఉంటే బెటర్ అని ప్రిన్స్ భావిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: