సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యామీనన్. నిత్యామీనన్ కి ఉన్న టాలెంట్ కి తన చేతిలో వరుసగా మూవీలు ఉండాలి. అంతే కాకుండా కనీసం మూడు నెలలకు ఒకటి అయినా రిలీజ్ కావాలి. అయితే నిత్యామీనన్ కి వరుసగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ, తను మాత్రం సెలెక్టెడ్ స్టోరీలనే ఎంచుకుంటూ, తన ఫిల్మ్ కెరీర్ ని చాలా స్లో గా రన్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఒక సారి తనతో నటించిన హీరో సరసన, మరోసారి నటించేందుకు రెడీ అయింది. గతంలో తెలుగులో వచ్చిన "ఏమిటో ఈ మాయ" అనే మూవీలో శర్వానంద్ సరసన నిత్యామీనన్ నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ కావడంతో, మరోసారి వీరిద్దరూ జోడి కట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఓ రొమాంటిక్ డ్రామా చిత్రం రానుంది. ఆ మూవీకి టైటిల్ ని "మళ్ళి మళ్ళి ఇది రాని రోజు" అని ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, సెట్స్ మీదకి త్వరలోనే వెళ్ళనుంది. కె.యస్.రామారావు ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదిలా ఉంటే నిత్యామీనన్ ఈ సంవత్సరంలో తెలుగులో ఎక్కువ మూవీలు చేయటానికి ఆసక్తి చూపిస్తుంది. కాని నిత్యా మీనన్ కి ఉన్న నోటి దురుసు కారణంగా, చాలా మంది తనతో మూవీ అంటే కొంత వరకూ భయపడుతున్నారంట. అందుకే తనని హీరోయిన్ గా తీసుకునేందుకు చాలా మంది దర్శకులు, అలాగే హీరోలు కూడ ఆసక్తి చూపిచడంలేదంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: