ఎన్టీఆర్, పూరిజగన్నాధ్ ల కాంబినేషన్ లో రకరకాల సమస్యలపాలు పడి తిరిగి షూటింగ్ మొదలు అయిన లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ హడావిడి చేస్తోంది. ఇప్పటిదాకా ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్న దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో అనూప్ రూబెన్స్ వచ్చి చేరాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఫిలింనగర్ లో వినిపిస్తున్నవార్తల ప్రకారం ఈ సినిమాకు ఎన్నిసార్లు పూరి మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేయమని పూరి అడిగినా ఈసినిమాకు ఎటువంటి ట్యూన్స్ దేవిశ్రీ ఇవ్వకుండా రోజులు గడుపుతూ ఉండటంతో విసుగు చెందిన పూరి ఈ నిర్ణయం తీసుకున్నాడు అని టాక్. అదీకాక గతంలో పూరి, దేవిశ్రీ తో కలిపి ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమాకు పని చేసినప్పుడు కూడా దేవి, పూరి అడిగిన విధంగా ట్యూన్స్ ఇవ్వలేదు అనే టాక్ గతంలో కూడా వినిపించింది. అదీకాక ప్రస్తుతం అనూప్ హవా టాలీవుడ్ లో బాగా నడుస్తూ ఉండటం అతడి సినిమాలు చాల హిట్ అవుతూ ఉండటటం సెంటిమెంట్ కూడా ఈ విషయాన్ని ప్రభావితం చేసింది అనే టాక్ ఉంది.  జూనియర్ నటించిన ‘రభస’ కు అనూప్‌నే అనుకున్నా ఎన్టీఆర్ రేంజ్‌లో ట్యూన్స్ ఇవ్వలేడని భావించి ఆ ప్లేస్‌లో తమన్‌ను తీసుకున్నారు అనే వార్తలు గతంలో ఉన్నాయి. ఈ మధ్యనే ‘మనం’ సినిమాకు అనూప్ ఇచ్చిన మ్యూజిక్ హిట్ కావడంతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్టులో అనూప్ చేరిపోవడం కూడా ఈ అవకాశానికి కలిసి వచ్చింది అని అంటారు.  ప్రస్తుతం పవన్, వెంకీల ‘గోపాల గోపాల’ సినిమాకు మ్యూజిక్ చేస్తున్న అనూప్ ఖాతాలో మరో పెద్ద సినిమా రావడంతో అనూప్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కు గట్టి పోటీగా ఉన్నాడనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: