మెగా హీరో రామ్ చరణ్ నటించిన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన సెన్సార్ కటింగ్ డిటైల్స్ బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కటింగ్ డిటైల్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ గా వినిపిస్తున్నాయి. ఎందుకంటే యూత్ కోసం ఉంచిన కొన్ని హాట్ సీన్స్ ని సెన్సార్ వారు పూర్తిగా తొలగించారు. అంతే కాకుండా, పూర్తి ఫ్యామిలీ చిత్రంగా సెన్సార్ కటింగ్ జరిగిందని అంటున్నారు. అక్టోబర్ 1న విడుదలవుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, విడుదలకి అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే అన్ లైన్ బుకింగ్ లు హౌస్ ఫుల్ గా కనబడుతున్నాయి. అంతే కాకుండా బ్లాక్ మార్కెట్ కూడ ఈ మూవీకి ఎక్కువుగా ఉండొచ్చనే అంచానాలు వెలువడుతున్నాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ని ఇష్యూ చేశారు. ఇదిలా ఉంటే పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో జంతువులను యడ్లను చూపించారు. అందువల్ల జంతు సంరక్షణ సమితి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు 4 కట్స్ విధించింది. కొన్ని డైలాగులను మ్యూట్ చేయమన్నారు. డబుల్ మీనింగ్ ఉన్న డైలాగులకి బీప్ సౌండ్స్ వేయమని చెప్పారు. హీరోయిన్లపై చిత్రీకరించిన 4 రొమాంటిక్ సన్నివేశాలలో కొన్ని హాట్ విజువల్స్ ని రీప్లేస్ చేయమని చెప్పారు. వాటిలో హీరోయిన్ కి సంబంధించి కొన్ని న్యూడ్ ఫోజ్ లు, వెరీ ఎక్స్ పోజింగ్ లు దాదాపు మూవీలో 20 సెకండ్స్ పాటు ఉన్నాయి. వాటన్నింటిని మూవీ నుండి పూర్తిగా వేశారు. మొత్తంగా యూత్ కోసం ఉంచిన అతి కొద్ది హాట్ కంటెంట్ కూడ పోయి, ఇప్పుడు గోపిందుడు అందరివాడేలే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: