ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొద్దిగా డైలామాలో ఉన్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే తను ఎటువంటి తరహాలో కథలని ఎంచుకోవాలో, అలాగే ఏ విధమైన డైరెక్టర్స్ తో మూవీని చేయాలో కన్ ఫ్యూజన్ లో ఉన్నాడంట. తాజాగా ఆగడు మూవీ ఇచ్చిన ఝలక్ నుండి మహేష్ ఇంకా తేరుకోలేదు. డైరెక్టర్ ని నమ్మి మూవీని చేస్తే, తీరా ఆ మూవీ బాక్సాపీస్ వద్ధ ఘోరంగా పరాభవాన్ని చూపించింది. దీంతో శ్రీనువైట్లకి ఇప్పట్లో మూవీని ఇవ్వకుడదని మహేష్ నిర్ణయించుకున్నాడంట. అయితే ప్రస్తుతం మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీని చేయబోతున్నారు. ఈ మూవీ తరువాత ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నాడు అనే దానికి ఇంకా క్లారిటి రాలేదు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం మహేష్ నెక్ట్స్ మూవీ పూరీ జగన్నాధ్ తో ఉంటుందని అంటున్నారు. అలాగే తాజాగా పూరీ జగన్నాధ్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఇది నిజమే అని తెలుస్తుంది. పూరీని తన తదుపరి సినిమా పూరి జగన్నాధ్ ఎవరితో అని అడిగితే ‘నా తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని, దానికి స్టొరీ లైన్ మరియు స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు హైదరాబాద్ లో లేరు. తను ఇండియా తిరిగి రాగానే మహేష్ ని కలిసి కథ చెబుతానని’ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మెన్ అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. మహేష్ మళ్ళీ పూరీనే నమ్ముకోవడం అనేది సరైనది కాదని ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారు బాహాటంగా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: