జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నా సరైన అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్ లో కాని, కోలీవుడ్ లో కాని ఎక్కడా అవకాశాలు లేక కనీసం ఐటమ్ గర్ల్ గా అయినా క్రేజ్ సంపాదిద్దామని షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ప్రయత్నించినా ఎక్కడా ప్రియమణికి అదృష్టం కలసి రావడంలేదు. దీనితో సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రియమణి పెళ్లి చేసుకోబోతోందని కొన్ని మీడియా వర్గాలు వార్తలు వ్రాసాయి. అంతేకాదు ఒక వ్యాపార వేత్తతో ప్రియమణి డేటింగ్ చేస్తోందని కొన్ని మీడియా వర్గాలు గాసిప్పులు కూడా వ్రాసాయి. అయితే ఈ వార్తలకు ఒక అనుకోని ట్విస్ట్ ఇస్తూ ప్రియమణి మీడియాతో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన ప్రియమణి తన లైఫ్ పార్టనర్ గురించి ఓ క్లూ ఇచ్చింది. తనకు కాబోయే భర్త సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లోని తాజ్‌బంజారా హోటల్‌లో మీడియాతో మాట్లాడిన ప్రియమణి, తన మనసులోని మాటను చాల ఆశ్చర్యకరంగా బయట పెట్టింది.  బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకుని సెకండ్ వైఫ్‌గా వుండే బదులు సినిమాటోగ్రాఫర్‌ని పెళ్లిని చేసుకుని మొదటి భార్యగా వుండటమే బెటరని మీడియా ముందు ప్రియమణి కామెంట్ చేయడమే కాకుండా తన పెళ్ళికి సంబంధించిన వివరాలు త్వరలో చెపుతాను అని మీడియాకు షాక్ ఇచ్చిన ప్రియమణి మాటలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. ఇంతకీ ప్రియమణి మనసు దోచిన ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరో తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: