యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ నేనో రకం. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ఓ వైపు చిత్ర షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన పనులని కూడ స్టార్ చేశారు. మరో వైపు మ్యూజిక్ సంబంధించిన అన్ని పనులని పూర్తి చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జూనియర్ యన్టీఆర్ నటిస్తున్న నేనో రకం మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని డైరెక్టర్ పూరీ జగన్నాధ్ స్వయంగా తీసుకున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే, తాజాగా అనూప్ రూబెన్స్ యంగ్ టైగర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. పూరీజగన్నాధ్ అప్పుడే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన రిలీజ్ డేట్ జనవరి 9న అని అనౌన్స్ చేశాడు. దాంతో ఈ చిత్ర టీం దగ్గర టైం తక్కువగా ఉండటంతో అనుకున్న టైం కల్లా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతోనే మరో మ్యూజిక్ డైరెక్టర్ ని రంగలోకి దింపారు. అనూప్ రూబెన్స్ మూవీకి సంగీతాన్ని అందిస్తే, మణిశర్మ మూవీకి సంబంధించిన రీ-రికార్టింగ్ స్కోర్ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన దానిపై దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా జరిగేలా షెడ్యూల్ చేసారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మూవీకి సంబంధించిన స్టోరి చాలా పవర్ ఫుల్ కావడంతో, అందుకే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం మణిశర్మని తీసుకున్నట్టుగా చిత్ర వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: