టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనేది చాలా సర్వసాధారమైన విషయం. అయితే ప్రస్తుతం కాలంలో పలువురు బడా హీరోల వారసులు, బడా ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొత్త హీరోలు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వారిలో ముఖ్యగా మెగా హీరోల జాబితా ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే వస్తుంది. అయితే మెగా ఫ్యామిలీలో భారీ క్రేజ్ ని కలిగిఉన్న పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ కూడ త్వరలోనే అఫిషియల్ గా ఓ లీడ్ రోల్ తో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే అకిరా నందన్ ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. టాలీవుడ్ మార్కెట్ ని క్యాష్ చేసుకోవటానికి రేణుదేశాయ్ ప్రయత్నిస్తుంది. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో నెంబర్ వన్ కాబట్టి, అకీరా నందన్ ని ఇప్పటి నుండే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయటానికి కావాల్సిన సన్నాహాలను రేణుదేశాయ్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే మరి పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కూడ తన తండ్రి గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను బయటకు చెబుతుంది. అభిమానులకు ఎంతో ఇష్టమైన ‘గబ్బర్ సింగ్’ ఆద్య ఫేవరెట్ ఫిల్మ్ అని ఆమె తల్లి రేణు దేశాయ్ చెప్పారు. ‘మా పాపకు ‘గబ్బర్ సింగ్’ సినిమా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు టీవీ ఆన్ చేసినా ‘గబ్బర్ సింగ్’ సినిమా చూద్దాం అంటుంది. అకిరాకు కూడా ఆ సినిమా అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి కోసం ఆ సినిమాను 60 సార్లు చూసుంటాను. నాకు కూడా సినిమా బాగా నచ్చింది. పోలీసుస్టేషన్‌ లో జరిగే అంత్యాక్షరి సన్నివేశం చాలా ఇష్టం’ అని రేణు దేశాయ్ తెలిపారు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ‘జానీ’ తన ఫేవరెట్ ఫిల్మ్ అని రేణుదేశాయ్ చెబితే, పిల్లలిద్దరూ గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన సీన్స్ ని పదే పదే చూడాలంటూ తనకి తెగ గుర్తు చేస్తుంటారని చెప్పింది. మొత్తంగా అప్పుడే తన తండ్రి నటించిన మూవీలలో ఇష్టమైన మూవీలను గుర్తుపెట్టుకుంటూ, పిల్లలు ఇద్దరూ వాటిని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుందని ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: