వెంకటేష్ పేరు వినగానే ఫ్యామిలి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న వెంకటేష్ తిరిగి తనకు కలిసి వచ్చిన ఫ్యామిలీ సినిమాలనే వరస పెట్టి చేస్తున్నాడు. అదేవిధంగా గతంలో ఫ్యామిలీ సినిమాలకు చిరునామాగా దర్శకుడు దశరథ్ పేరు వినిపించేది. ఈ దర్శకుడు కూడా ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేసి పరాజయాలు నెత్తిన పెట్టుకున్నాడు. పరాజయాలతో వచ్చిన గుణ పాఠంతో తను కూడా మారి ఈ మధ్య వెంకీని కలిసి దశరధ్ ఓ కధ చెప్పారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ కధ ఓకే అయితే వచ్చే ఏడాది సినిమా సెట్లపైకి వెళ్లవచ్చు అని ఫిలింనగర్ టాక్. ‘గోపాల గోపాల’ విడుదల అయ్యాక ఈ సినిమా ప్రారంభం అవుతుంది అని అంటున్నారు.  అయితే ఈమధ్యలో దర్శకుడు వీరు పోట్ల చెప్పిన ఒక కధ నచ్చడంతో వెంకటేష్ ఈ సినిమాలో రవితేజాతో కలిసి నటిస్తాను అని మాట ఇచ్చినట్లుగా వార్తలు ఉన్నాయి. దీనితో వెంకటేష్ తన ‘గోపాలుడి’ సినిమా తరువాత దశరథ్ వైపు వెళ్ళాలా లేదంటే వీరు పొట్ల వైపు వెళ్ళాల అన్న ఆలోచనలతో వెంకీ నలిగి పోతున్నాడు అని ఫిలింనగర్ వర్గాల సమాచారం...  

మరింత సమాచారం తెలుసుకోండి: