గతంలో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ ని అందుకొని, తోటి హీరోయిన్స్ కి చెమటలు పట్టించిన హీరోయిన్ తమన్న. తరువాత కొంత కాలం పాటు ఎటువంటి ఆఫర్స్ ని ఒప్పుకోకుండా సైలెంట్ గా ఉంది, ఇప్పుడు మళ్ళీ తమన్న జోరుతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తమన్న రీసెంట్ గా టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ డైరెక్టర్ కి ఝలక్ కి ఇచ్చింది. మేటర్ లోకి వెళితే, ‘లెజెండ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను తన నెక్ట్స్ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అందరికి తెలిసిన విషయం. ఇటీవలే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తమన్నాని హీరోయిన్ గా ఎంపిక చేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం తమన్నా ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. గతంలో బెల్లంకొండ శ్రీనువాస్ నటించిన మొదటి మూవీలో సమంత లీడ్ రోల్ కాగా, తమన్న ఐటెం సాంగ్ కి పరిమితం అయింది. అయితే రెమ్యునరేషన్ పరంగా సమంతకి దాదాపు 5 కోట్ల రూపాయలు అందినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. అలాగే తమన్నకి సైతం కేవలం ఒకే ఒక్క సాంగ్ కోసం లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ లెక్కలను గుర్తు పెట్టుకున్న తమన్న, ఇప్పుడు తను లీడ్ రోల్ చేస్తుంది కాబట్టి, దాదాపు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని ఆశిస్తున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. తమన్న భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం, నిర్మాతలు అందుకు సిద్ధంగా లేకపోవడంతో, ఈ లోపే తమన్న తన నిర్ణయాన్ని చెప్పేయటం జరిగిపోయింది. “తను ఈ మూవీలో నటించడంలేదంటూ” చెప్పేసరికి డైరెక్టర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఇదే విషయాన్ని ఈ చిత్రానికి సంబందించిన వారిని అడిగితే వారు కూడా దాదాపు అవుననే అంటున్నారు. మరి ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన జోడీ కట్టే భామ ఎవరా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: