మరణానికి అతి చేరువలో ఉన్న ఒక చిన్నారి చివరి కోరికను తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం ఖమ్మం వెళుతున్నాడు. నిన్నటిదాకా హుదూద్ తుఫాన్ బాధితులకు ధైర్యం చెపుతూ ఉత్తరాంద్రలో పర్యటించిన తన కోసం ఒక అమ్మాయి మృత్యువు ముంగిట్లో ఉండి కూడా తన పేరే తలుస్తోందని ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’ ద్వారా తెలుసుకున్నాడు.  ఆ ఫౌండేషన్ చెపుతున్న వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ అనే అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతోంది. ఆమెకు చికిత్స చేసినా ఫలితం ఉండకపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో కన్నీరు మున్నీరైన ఆమె తలిదండ్రులు నాగయ్య, నాగమణిలు పవన్ ను చూడాలి అన్న తమ కుమార్తె చివరి కోరికను అయినా తీర్చడానికి తెగ మధపడిపోతున్నారు. ఈ విషయాన్ని 'మేక్ ఎ విష్' సంస్థకు తెలియ చేసిన నేపధ్యంలో ఆ సంస్థనిర్వాహకుల కృషి వల్ల పవన్ అసలు విషయం తెలుసుకుని ఆ అమ్మాయి కోరిక తీర్చడానికి పవన్ నేడు ఖమ్మం వెళుతున్నాడు. తాను ఎంతగానో అభిమానించే పవన్ ను చూసిన ఆనందంతో మరి కొంత కాలమైన శ్రీజ బతకాలని కోరుకుందాం.  ఆర్తుల పాలిట నేనున్నాను అంటూ పవన్ చేస్తున్న సామజిక కార్యక్రమాలు అత్యంత హర్షనీయం...  

మరింత సమాచారం తెలుసుకోండి: