ఈ సంవత్సరం వరస పెట్టి రెండు పరాజయాలు కొన్ని నెలల గ్యాప్ తో మహేష్ కెరియర్ పై దాడి చేయడంతో ఎదో విధంగా వచ్చే సంవత్సరమైనా హిట్ కొట్టాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు మహేష్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే సంవత్సరం మహేష్ ఒక సినిమాను చేయబోతున్నాడు అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ సినిమా కధ పై రకరకాల రూమర్స్ రావడంతో చాలామంది అనుకుంటున్నట్లుగా ఈ సినిమా గతంలో మహేష్ పూరీల కాంబినేషన్ లో వచ్చిన ‘బిజినెస్ మేన్ ‘ కు సీక్వెల్ కాదు ఇది వేరే కధ అని పూరి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఫిలింనగర్ లో లేటెస్ట్ గా వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు పూరి ‘రోగ్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.  అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం మేలో మొదలు పెట్టి సెప్టెంబర్ ప్రాంతంలో విడుదల చేయాలని పూరి ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరీ మహేష్ ల కాంబినేషన్ లో మూడవ సారి విజయం కోసం ప్రయత్నిస్తున్న ఈ టైటిల్ ను చూస్తే మటుకు ఏదోవిధంగా ఈ ‘రోగ్’ కధలో పూరి అతి తెలివిగా ‘బిజినెస్ మేన్ ‘ కధకు పొడిగింపుగా తీయబోతున్నాడా? అనే అనుమానం వస్తుంది.  స్పీడ్ గా సినిమాలు తీయడమే కాదు అంత స్పీడ్ గా పరాజయాలు అందుకోవడంలో రికార్డు ఉన్న పూరి జగనాథ్ ఈ ‘రోగ్’ ను సరిగా తీర్చి దిద్దకపోతే మహేష్ అభిమానుల చేత ఇదే టైటిల్ తో తిట్టించుకున్నా ఆశ్చర్య పడనక్కర లేదు..  

మరింత సమాచారం తెలుసుకోండి: