తాను నటిస్తున్న సినిమాలలో సహజంగా కనిపించడం కోసం ఎటువంటి సాహసాలకైనా సిద్దంగా ఉంటాడు కమలహాసన్. అందుకే ఆయన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కమల్ ను అభిమానించే కోట్లాది మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.  ప్రస్తుతం కమల్ మలయాళంలో అదేవిధంగా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాను తమిళంలో ‘పాపనాసనం’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా కోసం కమల్ చేసిన సాహసం హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య ఈ సినిమా క్లైమేక్స్ సన్నివేశాలు కేరళాలోని తొడుపుళా ప్రాంతంలో చిత్రీకరించారు.  ఈ సినిమాలోని క్లైమేక్స్ సన్నీవేశంలో పోలీసు పాత్రను పోషిస్తున్న కళాభవన్ మణి కమల్ ను కొట్టే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఆ దెబ్బలకు కమల్ ముక్కు బాగా ఉబ్బినట్లు చూపించేందుకు కమల్ యూనిట్ సభ్యులు వద్దంటున్నా తన ముక్కలో సహజత్వం కోసం రబ్బరు బెరడు పెట్టుకున్నాడట. నిన్న ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో కమల్ ముక్కులోకి దూరిన ఈ రబ్బరు బెరడు కమల్ దెబ్బలు తినే దృశ్యాలు చిత్రీకరిస్తున్నప్పుడు కమల్ ముక్కులోకి మరింత లోపలికికి వెళ్లిపోయి ఎంత సేపటికి అది బయటకు రాకపోవడంతో కమల్ శ్వాస పీల్చు కోవడంలో చాల ఇబ్బంది పడ్డాడు.  అయితే ఈ విషయాన్ని గ్రహించిన యూనిట్ సభ్యులు కమల్ ను దగ్గరలోని హాస్పటల్ కు తీసుకు వెళ్లి వైద్యులు చేత ఎండోస్కోపి ద్వారా బయటకు తీయించి కమల్ ను కాపాడారు అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: