మహేష్ తన నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే సంవత్సరంలో రెండు భారీ సినిమాలు తనతో చేసి ఆర్ధికంగా బాగా నష్టపోయిన 14 రీల్స్ నిర్మాణ సంస్థను నిలబెట్టడానికి ఆ సినిమా నిర్మాతలకు వచ్చే సంవత్సరం ఒక సినిమాను చేసి వారి కష్టాలను గట్టేక్కిస్తాను అని మహేష్ ఆ నిర్మాతలకు మాట ఇచ్చినట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి.  ఈ వార్తలకు కొనసాగింపుగా మహేష్ ఈమధ్య తనను కలిసి ఒక మంచి కధను చెప్పిన శ్రీకాంత్ అడ్డాల ఓకె చెప్పడమే కాకుండా ఆ కధను డెవలప్ స్క్రిప్ట్ గా మారిస్తే తాను ఆ సినిమాను 14 రీల్స్ నిర్మాణ సంస్థ కోసం చేస్తాను అని దర్శకుడు శ్రీకాంత్ కు చెప్పడమే కాకుండా ఇదే విషయాన్ని తన 14 రీల్స్ నిర్మాతలకు కూడా తెలియచేసాడు అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.  మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను చేస్తున్నప్పుడే శ్రీకాంత్ అడ్డాలకు ఈ కొత్త సినిమా కధకు ఆలోచన వచ్చింది అని టాక్. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను బాగా తీస్తాడు అని పేరున్న శ్రీకాంత్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయమై ఇప్పటికే దృష్టి పెట్టినా పూర్తి క్లారిటీ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ‘ముకుందా’ విడుదల తరువాత వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: