కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ బ్రాండ్ మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్న హీరో విశాల్. ఇదిలా ఉంటే విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ అప్ కమింగ్ ఫిల్మ్ పూజా. ఈ మూవీలో విశాల్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. తమిళంతో పాటు తెలుగులో కూడా యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకి, ఇప్పుడు పూజా మూవీ సవాల్ గా మారనుంది. ఎందుకంటే శృతిహాసన్ తో ఉన్న పరిచయంతో, తనని పూజా మూవీలో హీరోయిన్ గా నటింపచేయించుకున్నాడు. అలాగే శృతిహాసన్ చేత కొద్దిగా ఘూటు ఎక్స్ పోజింగ్ ని సైతం విశాల్ ఒప్పించి, చేయించాడని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది. ఇప్పుడు ఈ సినిమా తమిళ్ లో ‘పూజై’ గానూ, తెలుగులో ‘పూజ’ గా దీపావళి కానుకగా అక్టోబర్ 22 న రిలీజ్ కానుంది. ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా విశాల్ కెరీర్ లోనే భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ‘పూజ’ సినిమాని తెలుగు తమిళ భాషల్లో కలిపి మొత్తంగా 1100 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. ముఖ్యంగా కోలీవుడ్ లో పూజై మూవీకి హైప్ కి కారణం శృతిహాసన్ గ్లామర్ కీలకంగా మారిందని అంటున్నారు. గతంలో ‘యముడు’, ‘సింగం’ సినిమాలను అందించిన కమర్షియల్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విశాల్ తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు. విశాల్, హరి కాంబినేషన్ లో ఇది వరకూ వచ్చిన ‘భరణి’ సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి. మొత్తానికి విశాల్ మాత్రం హీరోయిన్ అందాలు, హీరోయిన్ క్రేజ్ ని ఎక్కువుగా పబ్లిసిటిలో ఉపయోగించుకున్నట్టుగా కోలీవుడ్ మీడియా, తెగ కామెంట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: