సినిమా ఇండస్ట్రీలో ప్లాపులు, బ్లాక్ బాస్టర్స్ అనేవి సర్వసాధారణం. అయితే ఒకసారి నష్టాలు వస్తే, తిరిగి కొంత కాలం వరకూ గ్యాప్ తీసుకున్న తరువాత ఆ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వస్తుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. తాజాగా ఓ మూవీ బాక్సాపీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన వెంటనే, ఆ మూవీకి చెందిన నిర్మాతలు మళ్ళీ అదే హీరోతో మూవీని తీయటానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. 2015 సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమా ఆతర్వాత మహేష్ బాబు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది కాకుండా మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీసిన శ్రీ కాంత్ అడ్డాల కూడా తన తదుపరి సినిమా కోసం మహేష్ బాబుని సంప్రదిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు తో ఆగడు, వన్-నే నొక్కడినే, దూకుడు వంటి మూవీలని తీసింది. వీటిలో ఆగడు, వన్-నే నొక్కడినే మూవీలు బాక్సాపీస్ వద్ద ఆశించినంత సక్సెస్ ని సాధించలేకపోయింది. అయితే ఈ నిర్మాతలు మాత్రం మహేష్ బాబు మరో మూవీకి సిద్ధపడుతున్నారు. శ్రీ కాంత్ అడ్డాల వరుణ్ తేజ్ హీరో గా చేసిన ‘ముకుంద’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాని డిసెంబర్ 25నా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది రిలీజ్ అయ్యాకే 14 రీల్స్ వారు శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ కి సంబంధించిన న్యూస్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: