నిన్నటిదాకా పబ్బులలోను, ఫంక్షన్స్ లోను జంటగా హడావిడి చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా మారిన రానా, త్రిషలు ఇప్పుడు ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ట్విటర్ యుద్ధం వెబ్ మీడియాలో చేసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పీకల లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ప్రేమ జంటకు ఏమైంది అంటూ సెటైర్లు కూడా అప్పుడే మొదలు అయ్యాయి.  రానా లేటెస్ట్ గా చేసిన ట్విట్ లో త్రిష పేరును ప్రస్తావించ కుండా ‘ఓ కథకు ఎప్పుడూ మూడు కారణాలుంటాయి. నీ వైపు, ఎదుటి వారి తరుపున వాదనలుంటాయి. నిజమనేది ఈ రెండిటికి భిన్నంగా ఉంటుంది' అంటూ రానా ఇటీవల ట్వీట్ చేసాడు. అయితే దీనికి త్రిష తన ట్విట్ లో చాల ఘాటుగా స్పందించింది. ‘ఒక వ్యక్తిని మరిచి పోవడం చాలా సులభం. మళ్లీ అతన్ని నమ్మడం అంటూ ఉండదు' అని త్రిష ట్వీట్ చేసింది.  ఈ ట్విట్స్ లో రానా త్రిషలు ఒకరి పేర్లు ఒకరు ప్రస్తావించక పోయినా ఒకరినుద్దేశించి ఒకరు చేసుకున్న వ్యాఖ్యలే అని అంటూ విశ్లేషకులు అర్ధాలు తీస్తున్నారు. ఈ మధ్య వీరిద్దరి మధ్య ప్రేమకు బ్రేకప్ అయిందని జాతీయ మీడియాలో వార్తలు కూడా వచ్చిన నేపధ్యంలో లేటెస్ట్ గా రానా, త్రిషల మధ్య జరుగుతున్న ట్విటర్ వార్ బట్టి వీరి ప్రేమకు ముగింపు పలికినట్లే అనే కామెంట్స్ ఫిలింనగర్ గట్టిగా వినిపిస్తున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: