టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తను చేస్తున్న మూవీలు అన్ని కథా పరంగా వైవిధ్యంతో తెరకెక్కినవే. స్టోరిలను సెలక్ట్ చేసుకోవడంలో తనదే ఫైనల్ డెసిషన్. తనే స్టార్ బ్యూటీ, నిత్యా మీనన్. ఇప్పటి వరకూ నిత్యామీనన్ నటించిన మూవీలు అన్నీ బాక్సాపీస్ వద్ద మినిమం గ్యారెంటీ ఫిల్మ్ గా నిర్మాతలకు మనీను తెచ్చిపెట్టినవే. అయితే తనుకి భారీగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ, వచ్చిన ఆఫర్స్ అన్నింటికి ఒప్పుకోకుండా, సెలక్టివ్ స్టోరిలనే చేసుకుంటూ వస్తుంది. కథ నచ్చాలి, అలాగే రెమ్యునరేషన్ నచ్చాలి అంటూ రెండు సరిసమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమాలో ఒక హీరోయిన్ గా నిత్యా మీనన్ ఎంపిక దాదాపు ఖాయమైనట్టేనని అందరికి తెలిసిన విషయమే. సమంత, ఆదా శర్మలతో పాటు నిత్యా మీనన్ కూడా బన్నీతో రొమాన్స్ చేయబోతుంది. ఈ ఆఫర్ తనకి వచ్చిన వెంటనే అందుకు యస్ చెప్పకుండా, కథని విన్న తరువాతే త్రివిక్రమ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతే కాకుండా రెమ్యునరేషన్ విషయంలో తన మాటే నిలబెట్టుకుందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీలో నటించటానికి నిత్యామీనన్, దాదాపు 70 లక్షల రూపాయల వరకూ డిమాండ్ చేసింది. అందుకు నిర్మాతల వద్ద నుండి కూడ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మొదట 50 లక్షలకే త్రివిక్రమ్ ఒప్పుకున్నట్టు, తరువాత జరిగిన చర్ఛల అనంతరం, నిత్యామీనన్ రెమ్యునరేషన్ 70 లక్షలకు ఓకె అయినట్టు క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అల్లుఅర్జున్ సరసన ఆఫర్ అనే టాపిక్ పక్కన పెట్టి తన రోల్, అండ్ రెమ్యునరేషన్ గురించే నిత్యామీనన్ పదే పదే చెప్పుకున్నట్టు టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో త్రివిక్రమ్ సినిమా కోసం నిత్యా మీనన్ డేట్స్ కేటాయించింది అని టాక్. నవంబర్ మూడవ వారం నుండి షూటింగ్ లో జాయిన్ అవుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్నాడట. ‘జులాయి’ తర్వాత త్రివిక్రమ్, శ్రీనివాస్ కలసి చేస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: