ఆ మధ్య అవయవ దానం కార్యక్రమం ప్రచారాన్ని చేయడమే కాకుండా తనతో పాటు తన భార్య అమల అవయవాలను మరణానంతరం దానం చేయడానికి ముందుకు వచ్చిన నాగార్జున సామజిక స్పృహ అందర్నీ ఆకర్షించింది. ఇప్పుడు నాగార్జున ఆధ్వర్యంలో అక్కినేని కుటుంబం అంతా నిన్న ప్రధాన మంత్రి మోడీ ఆశయాలు నెరవేర్చడానికి తమ వంతు సహకారం అందిస్తూ నిన్న హైదరాబాద్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టింది.  ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నాగచైతన్య, అఖిల్, సుశాంత్ తదితరులు బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో రోడ్లను శుభ్రం చేశారు. చీపుర్లు చేతపట్టి చెత్తను ఊడ్చారు. అక్కడ పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యేకంగా ధరించిన దుస్తులతో అక్కినేని కుటుంబం ప్రధాన ఆకర్షణగా ఈ కార్యక్రమంలో నిలిచింది. ఈ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి రావడం హాట్ టాపిక్ గా మారింది. మరి నాగార్జునను అనుసరిస్తూ ఇంకా ఎంతమంది టాలీవుడ్ హీరోలు ఈ కార్యక్రామాన్ని అనుసరిస్తారో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: