ఒకప్పుడు ఓ ఊపు ఊపిన హీరోయిన్ టబు. అయతే గత కొంత కాలంలో టబు కొన్ని తరహా కీలక పాత్రలు తప్పిటే, మామూలు రోల్స్ కూడ చేయడంలేదు. ఇదిలా ఉంటే ఓ నిర్మాత మాత్రం తన వద్ద ఉన్న స్టోరికి టబునే హీరోయిన్ గా ఉండాలంటూ తెగ పట్టుబడుతున్నాడు. ముఖ్యంగా టబు అయితేనే మూవీకి సెట్ అవుతుందని అంటూ, టబు కాల్షీట్స్ అడిగి మరీ ప్రీ బుకింగ్ చేసుకున్నాడు. అలాగే రెమ్యునరేషన్ కూడ భారీగానే ఆఫర్ చేసినట్టు బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే ఓ రియల్ మిస్టరీ డెత్ కేసు ఆధారంగా, నిర్మాత విశాల్ భరద్వాజ్ ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఢిల్లీలో డాక్టర్ల కుటుంబం. తల్లీదండ్రీ ఇద్దరూ వైద్యులే. కుమార్తె కూడా అదే దారిలో డాక్టర్ అవుదామనుకొంది. కానీ హఠాత్తుగా ఆమెను ఎవరో హత్య చేశారు. పోలీసులకు ఆ ఇంటి పనిమనిషిపై అనుమానం వచ్చింది. తెల్లారే సరికి ఆ పని మనిషీ హత్యకు గురయ్యాడు. పోలీసులకు చిక్కిన ఒకే ఒక్క క్లూ.. మాయమైనట్టైంది. మరో క్లూ అన్వేషించడానికి ఏడాది పట్టింది. పోలీసుల గురి మరొకరిపై పడేసరికి.. అతన్నీ ఎవరో చంపేశారు. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం షాక్ తింది. ఒక్క క్లూ కూడా దొరక్కుండా హత్యలు చేసిందెవరో తేల్చుకోవడానికి వాళ్లకు సంవత్సరాలు పట్టింది. చివరికి ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు ? పదేళ్లయినా పోలీసులకు ఈ కేసు అంతు చిక్కలేదు.
ఇది కథ కాదు. నిజం. ఢిల్లీలో సంచలంన సృష్టించిన ఆర్సీ తల్వార్ కేసు ఉదంతం ఇది. ఇప్పుడు ఈ మిస్టరీని మర్డర్స్ని సినిమాగా తీస్తున్నారు. టబు ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. విశాల్ భరద్వాజ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి మర్డర్ మిస్టరీ చిత్రాల్లో నటించడం ఇదే తొలిసారని టబు చెబుతోంది. విశాల్ భరద్వాజ్ గారి ఒత్తిడి మేరకే, తను ఈ స్టోరిలో నటించేందుకు అంగీకరించాల్సి వచ్చిందని తను చెప్పుకొచ్చింది. ఇంత థ్రిల్లింగ్ గా ఉన్న స్టోరిలో టబు నటించి, ఏ విధంగా ప్రేక్షకులని అలరిస్తుంటే తెలియాలంటే మరి కొంత సమయం పడుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: