గత శనివారం భాగ్యనగంలో జరిగిన సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఆడియో వేడుక తరువాత చిరంజీవి తన సన్నిహితులతో తన తీవ్ర అసహనాన్ని పంచుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏదైనా ఒక మెగా కుటుంబ ఆడియో ఫంక్షన్ కు మెగా హీరోలు అంతా వచ్చినా అభిమానుల నుండి పవన్ కనపడలేదు అన్న విషయమై వస్తున్న అరుపులకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి రావడం చాల అసౌకర్యంగా మారింది అని చిరంజీవి తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేసాడు అని రూమర్.  అదీ కాకుండా మెగా కుటుంబ హీరో ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడల్లా పవన్, చిరంజీవుల అభిమానుల మధ్య మాటల వార్ వెబ్ మీడియాలో జరుగుతూ పవన్ కావాలని ఊరిలొ ఉంది కూడా అ ఫంక్షన్ కు రాలేదా? అని రకరకాల ఊహలతో వెబ్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్ తనకు పవన్ కు ఉన్న దూరాన్ని మరింత పెంచుతున్నాయని చిరంజీవి మధన పడుతున్నట్లు టాక్.  అందుకే ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా రానున్న రోజులలో జరిగే మెగా హీరోల సినిమా ఫంక్షన్స్ కు పంపే పాసుల విషయంలో పవన్ వీరాభిమనులు లేకుండా జాగ్రత్త పడితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఉండవని చిరంజీవి అభిప్రాయపడుతున్నట్లు ఫిలింనగర్ కు చెందిన కొన్ని వర్గాల ప్రచారం.  అయితే వినపడుతున్న ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా చిరంజీవి, రామ్ చరణ్ లు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా పవన్ గురించి అడిగే ప్రశ్నలను తప్పించుకోవడం అంత సులువైన పని కాదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: