తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన కార్తికేయ్ మూవీపై బాలీవుడ్ కన్ను పడింది. నిఖిల్, కలర్ స్వాతి నటించిన ఈ మూవీ, తెలుగు ప్రేక్షకలని ఆకట్టుకుంది. అలాగే విమర్మకుల వద్ద నుండి నిఖిల్ ప్రశంశలు అందుకుంటున్నారు. ఈ తరహా స్టోరీలను చేయటానికి నిఖిల్ సహజంగా ఇష్టపడతాడంట. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ అయినా మంచి చిత్రాలు వస్తే చాలు ఇతర భాషా చిత్రాల్లో రీమెక్ చేయడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. అందులో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే, మంచి సౌత్ మూవీ దొరికితే దానిని తప్పకుండా రిమేక్ చేయటానికి సిద్ధపడుతుంది. దీంతో టాలీవుడ్ లో వచ్చిన చిత్రాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో వచ్చిన 'కార్తీకేయ' సినిమాను రీమేక్ చేయాలని బాలీవుడ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మళయాళం, తెలుగు పరిశ్రమలో 'దృశ్యం' సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో 'సైఫ్ ఆలీఖాన్' హీరోగా కార్తికేయ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. అలాగే తమిళంలో కూడా దీనిని రీమేక్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ కార్తికేయ మూవీ టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. నిఖిల్ కెరీర్ లో కార్తికేయ మూవీ కూడ చెప్పుకొదగ్గదని ట్రేడ్ టాక్. అయితే కార్తికేయ మూవీ స్టోరిని అప్పుడే బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ మేనజర్, సైఫ్ ఆలీ ఖాన్ కి వినిపించాడట. అందుకు సైఫ్ అలీ ఖాన్, కార్తికేయ మూవీ ప్రివ్యూని త్వరలో చూద్దాం అంటూ సమాధానం ఇచ్చాడని బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తన అప్ కమింగ్ ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: