సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తమన్నకి ఎంత స్పీడుగా ఆఫర్స్ వస్తున్నాయో, ఒక్కోసారి అంతే స్పీడుగా వెనక్కి కూడ వెళుతున్నాయి. ఇదిలా ఉంటే తమన్నకి తాజాగా మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. నాగార్జున, కార్తి కాంబినేషన్ లో రాబోతున్న ఆ మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్ గా తమన్న సెలక్ట్ అయింది. అయితే తను హీరోయిన్ గా నటిస్తున్న ఆ మల్టీస్టారర్ మూవీలో మరో హీరోయిన్ లేదు. తనే మెయిన్ హీరోయిన్. ఇద్దరి హీరోలకు తన రోల్ కీ రోల్ కావడంతో తమన్నని ఎలివేట్ చేసే క్యారెక్టర్ అది అని అంటున్నారు. ఇదిలా ఉంటే తమన్న తన రెమ్యునరేషన్ విషయంలో ఒక్కసారిగా భారీ మార్పులు చేసినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ కోటి రూపాయల బోర్డల్ లైన్ గా తమన్న రెమ్యునరేషన్ తీసుకుంటంది. ఇక నుండి ఆ అమౌంట్ ని దాదాపు ఎక్కువుగా పెంచి, కోటి ఎనభై లక్షలకు చేసిందని అంటున్నారు. ఇప్పుడు నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో పైడిపల్లి వంశీ తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో ఫిల్మ్ లో తమన్న తన కొత్త రెమ్యునరేషన్ ని ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో చిత్ర యూనిట్ ఆలోచనలోపడి, తమన్న రెమ్యునరేషన్ ని తగ్గించి, సెకండ్ హీరోయిన్ ని కూడ తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారట. తమన్నా ఇప్పటివరకూ నటించలేదు. ‘100% లవ్’, ‘తడాఖా’ చిత్రాలతో నాగచైతన్యకు మాత్రం లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. తనయుడితో హిట్ పెయిర్ అనిపించుకున్న తమ్ము... తండ్రితో నటించడం గమ్మత్తైన విషయమే. ఇక కార్తీ, తమన్నా ఎలాగూ హిట్ కాంబినేషన్. మొత్తానికి తమన్న తన రెమ్యునరేషన్ ని డబుల్ చేసినా, చిత్ర నిర్మాతల వద్ద నుండి మాత్రం ఎటుంది ఇబ్బుందులు ఎదురుకాకపోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: