కొద్దికాలం క్రితం విడుదల అయిన రవితేజ ‘పవర్’ సినిమా పవన్ ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ట్విస్టులు తీసుకున్న పవన్ కళ్యాణ్ తన ‘గబ్బర్ సింగ్ 2’ కు దర్శకత్వం వహించే పేర్లలో లేటెస్ట్ గా రవితేజాతో ‘పవర్’ సినిమాను దర్శకత్వం వహించిన బాబీకి ఛాన్స్ ఇవ్వాలని పవన్ శరత్ మరార్ లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారు అని టాక్.  ప్రముఖ సినిమా కార్పోరేట్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఈ సినిమాకు 70 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంతో భారీ స్థాయిలో నిర్మించబోతున్న ఈ సినిమా ఒక పవర్ ఫుల్ ప్యాక్డ్ మూవీగా తీర్చిదిద్దే సమర్ధత సంపత్ నంది కన్నా దర్శకుడు బాబీకి ఎక్కువ ఉంది అన్న ఆలోచనతో ఈ నిర్ణయం పవన్ తీసుకున్నాడు అని అంటున్నారు.  అయితే బాబీని దర్శకుడిగా ఇంకా ఖరారు చేయలేదని ఆయన పేరు పరిశీలనలో మాత్రమే ఉందని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లుగా వార్తలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సడన్‌గా డైరెక్టర్ మార్పు ఎందుకు జరిగిందని ఫిల్మ్‌నగర్‌లో చర్చ మొదలైంది.  నిన్నటిదాకా పవన్ ‘కత్తి’ సినిమా పై మోజు పడుతున్నాడు అనే వార్తలు రావడమే కాకుండా నిన్న ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన పవన్ ఇంకా తన నిర్ణయం ఈ సినిమా విషయం పై తెలియపరచకుండానే మళ్ళీ యూటర్న్ తీసుకుని తన ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ పై మనసు పెట్టి, ఇప్పుడు రవితేజా ‘పవర్’ దర్శకుడి వైపు దృష్టి మరల్చడం అందరికీ ఆశ్చర్యంగా మారి భవిష్యత్ లో ఇంకా ఎన్ని పేర్లు ఈ సినిమా గురించి బయటకు వస్తాయో అంటూ సెటైర్లు వేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: