సత్యదేవా దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తరువాత చేయబోయే సినిమా పై దృష్టి పెట్టాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుగా ఇష్టపడి ఆ తరువాత వదిలేసిన కథ ఇప్పుడు నందమూరి వారి కాంపౌండ్ లో చెక్కర్లు కొడుతోంది అనే వార్తలు వినపడుతున్నాయి.  ‘లౌక్యం’ సినిమాకు దర్శకత్వం వహించి ఎవరూ ఊహించని సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీవాస్ కోన వెంకట్ గోపీ మోహన్ లతో ఒక కథను తయారుచేయించి ఆ కథను కొద్దిరోజుల క్రితం రామ్ చరణ్ కు వినిపించాడు అనే వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ కథ పట్ల తన ఆశక్తిని కనపరిచిన చెర్రీ ఈ మధ్యన తనను మళ్ళీ కలిసిన శ్రీవాసుతో ఈ సినిమా కథలో తాను నటించలేను అని స్పష్టం చేసినట్లు టాక్. దీనితో కొత్త దర్శకులను ప్రోత్సహించే బాలకృష్ణ దగ్గర తన ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో అన్న ఆశతో బాలయ్యను కలిసినప్పుడు శ్రీవాస్ చెప్పిన కథ బాలకృష్ణకు నచ్చడంతో శ్రీవాస్ లౌక్యం నెరవేరింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ నటించబోయే 98వ చిత్రంగా ఈ సినిమాను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది అని ఫిలింనగర్ టాక్. ఈ సినిమాను కూడా త్వరగా పూర్తి చేసి 2016 లో తన 100వ సినిమా వైపు అడుగులు వేయాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు. బాలకృష్ణతో ‘సమర సింహ రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన బి. గోపాల్ కు ఈ నందమూరి సింహం తన 100వ సినిమా చాన్స్ ఇస్తాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏమైనా శ్రీవాస్ చాల లౌక్యంగా టాప్ హీరోలతో ప్రవర్తిస్తున్నాడనే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: