ఈమధ్యనే ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా మతమార్పడి వ్యవహారం మీడియాకు హాట్ న్యూస్ గా మారి రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన జరిగి కొద్ది నెలలు కూడా గడవ కుండానే యువన్ మూడవ సారి మరో పెళ్ళి చేసుకోబోతున్నాడు అనే వార్తలు కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  జప్ర్పున్నిసా అనే అమ్మాయితో యువన్ కు అక్టోబర్ 28న చెన్నైలో ఎంగేజ్మెంట్ జరిగింది అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే యువన్ తన వివాహ తేదీని ప్రకటిస్తాడని టాక్. సంగీత దర్శకుడిగా సంచలనాలు చేస్తున్న యువన్ 2005లో సుజయ చంద్రన్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె లండన్‌లో సెటిలైన ప్రముఖ సింగర్. తర్వాత ఆ ఇద్దరూ పరస్సర అంగీకారంతో విడిపోయారు.  ఆ తర్వాత 2011లో శిల్పా అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు యువన్. అయితే వీరిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు ఏర్పడటంతో యువన్ ఆమెకు కూడా విడాకులు ఇచ్చి ఇప్పుడు ఈ మూడవ వివాహం చేసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.  అనేక సూపర్ హిట్ సినిమాలకు తనదైన శైలిలో సంగీతం అందించిన యువన్ తన తల్లి మరణం తరువాత తీవ్ర మనో వేదనకు గురై ఒక స్నేహితుడి సలహామేరకు ముస్లిమ్ మతాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. మొన్న దసరాకు విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకు కూడా మంచి ట్యూన్స్ అందించి తన రేంజ్ ఏమిటో తెలియచేసాడు యువన్..   

మరింత సమాచారం తెలుసుకోండి: