అఖిల్ హీరోగా నటించబోయే తోలి సినిమా పనులు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఈ సినిమాను లాంచనంగా నవంబర్ 14న కొబ్బరికాయ కొట్టడంతో ప్రారంభించినా అసలు షెడ్యూల్ 24 నుండి నిర్విరామంగా జరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా నిర్మాణం భాద్యత నితిన్ తండ్రి సుధాకర రెడ్డి చేపట్టడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆశక్తికర విషయం ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ సినిమాలో హీరో నితిన్ ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని టాక్.  ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో వచ్చే ఈ పాత్ర ఈ సినిమా కథకు టర్నింగ్ పాయింట్ అయ్యేడట్లు డిజైన్ చేసారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే యంగ్ హీరోగా స్థిర పడ్డ నితిన్ కోసం ఈ పాత్రను ఎందుకు క్రియేట్ చేసారు అనే విషయం పై రకరకాల రూమర్స్ వస్తున్నాయి.అఖిల్ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో అటువంటి భారీ సినిమాలో నితిన్ కూడా నటిస్తే బాగుంటుంది అని నితిన్ తండ్రి నాగార్జునకు సూచించడంతో కథలో ఈ మార్పు జరిగింది అని అంటున్నారు.  అఖిల్ తొలి సినిమా ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి సినిమా ప్రారంభమైన మొదటి రోజు నుండే ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచడానికి నాగ్ తన అనుభవాలన్నీ ఈ సినిమా పై పెట్టి ఎటువంటి పొరపాట్లు జరగకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని అంటున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: