మంచి అభిరుచిగల దర్శక నిర్మాతగా పేరు గాంచిన గుణ్ణం గంగరాజు ‘లిటిల్ సోల్జర్స్’ నుండి ఈమధ్యనే వచ్చిన ‘చందమామలో అమృతం’ సినిమా వరకు అనేక మంచి సినిమాలను నిర్మించిన పేరు ఈయన సొంతం. అటువంటి గంగరాజు ఈమధ్య ఒక మీడియా సంస్థకు యిచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత తెలుగు సినిమా రంగ నిర్మాతల పరిస్థితి పై చేసిన కామెంట్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.  ఎవరికైనా ఎవరి మీద అయినా కోపం ఉంటె వారిని సినిమా నిర్మాతలుగా మారమని ప్రోత్సహించి వారి పగను తీర్చుకోవచ్చు అంటూ నేటి టాలీవుడ్ సినిమా రంగ నిర్మాతల పరిస్థితి పై సెటైర్లు వేసాడు గంగరాజు.  ప్రస్తుతం తెలుగు సినిమా నిర్మాతలు అంతా బయటకు చెప్పుకోలేక పోయినా భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నారు అని అంటూ తాను మంచి సినిమాలు తీసి ఎంతో నష్టపోయానని అంటూ తాను తీసిన ‘చందమామలో అమృతం’ సినిమా తనకు 7 కోట్ల నష్టాన్ని కలిగించడమే కాకుండా తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని అంటున్నాడు గంగరాజు.  అయినా తనకు సినిమాల పై ఉన్న విపరీతమైన మోజుతో సినిమా రంగాన్ని వదులుకోలేక పోతున్నానని గంగరాజు చేసిన కామెంట్లు నేటి టాలీవుడ్ సినిమా నిర్మాతల పరిస్థితికి దర్పణంగా ఉన్నాయి. మరి రోజురోజుకు కూరుకు పోతున్న నిర్మాతల పరిస్థితి పై మన హీరోలు ఆలోచిస్తారా? అన్నదే ప్రశ్న...    

మరింత సమాచారం తెలుసుకోండి: