పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. గోపాల గోపాల మూవీకి సంబంధించిన ప్రతి న్యూస్ ని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ విషయంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ కి ఫ్యాన్స్ అందరూ నిరుత్సాహ పడిపోయారు. దీంతో మూవీకి ఏమైనా డేమేజ్ జరగుతుందో అనుకున్న నిర్మాత వెంటనే మూవీపై స్టేట్ మెంట్ ఇచ్చాడు. మేటర్ లోకి వెళితే, టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఇంకా 20 రోజులపైన షూటింగ్ పార్ట్ బాలన్స్ ఉంది. దాంతో ఈ చిత్ర టీం చాలా ఫాస్ట్ గా సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. కానీ కొద్ది రోజులుగా షూటింగ్ బాలన్స్ ఉండడం వలన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం లేదని కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన శరత్ మరార్ సినిమా కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం చాలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నామని తెలిపాడు. దీంతో జూనియర్, పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ఈ మల్టీస్టారర్ మూవీ పోటీ కానుంది. 2015 సంక్రాంతి బరిలో ఈ రెండు మూవీలు పోటీ పడన్నాయి. మొన్నటి వరకూ జూనియర్ మూవీకి పోటీ లేదంటూ వచ్చిన టాక్స్ లో నిజం లేదని తేలడంతో, ఇప్పుడు రెండు మధ్య జరుగే పోటీని చూడటానికి సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: