రమ్యకృష్ణ తో కృష్ణవంశీ ఒక హారర్ సినిమా తీయబోతున్నాడు అనే వార్తలు ఈమధ్య తెగ వినిపించాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని కృష్ణవంశీ తన రూట్ మార్చి ఏకంగా గోవాకు వెళ్ళి జూనియర్ ను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం కృష్ణవంశీ రెండురోజుల క్రితం గోవా వెళ్ళి జూనియర్ ను ఏకాంతంగా కలిసి తాను లేటెస్ట్ గా తయారు చేసిన ‘రాఖీ’ సినిమాకు సీక్వెల్ కథను వినిపించాడని టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రాఖీ ఆర్ధికంగా అంత విజయవంతం కాకపోయినా వీరిద్దరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది.  ప్రస్తుతం దేశంలో స్త్రీల పై అత్యాచారాలు పెరిగి పోతున్న నేపధ్యంలో అటువంటి విషయాలకు సంబంధించి ఒక పవర్ ఫుల్ కథను కృష్ణవంశీ ‘రాఖీ’ సినిమాకు సీక్వెల్ గా మార్చాడని టాక్. అయితే ఇప్పటికే పరాజయాల భారంలో ఉన్న జూనియర్ మళ్ళీ కృష్ణవంశీ తో మరో ప్రయోగానికి సిద్దపదతాడా అన్నదే ప్రశ్న.  ‘గోవిందుడు అందరి వాడెలే’ అనుకున్న విజయాన్ని అందుకోలేక పోవడంతో కృష్ణవంశీ చెప్పే కధలకు బహుశా ఏ టాప్ హీరోలు అంగీకరించే అవకాశం లేదు. అదే జరిగితే రమ్యకృష్ణ ఎలాగు ఉన్నది కాబట్టి ఆమెతో ఒక భయ పెట్టే హారర్ సినిమా తీయడానికి కృష్ణవంశీకి ఎదురు ఉండక పోవచ్చు..  

మరింత సమాచారం తెలుసుకోండి: