“పిల్ల నువ్వులేని జీవితం” మూవీకి సంబంధించిన బిజినెస్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ “పిల్ల నువ్వులేని జీవితం” మూవీకి సంబంధించిన మొదటి వారం కలెక్షన్స్ 5 కోట్ల రూపాయలను దాటగా, రెండో వారంలో వచ్చే కలెక్షన్స్ తో ఈ మూవీ బిజినెస్ భవిష్యత్ తేలబోతుంది. అలాగే “పిల్ల నువ్వులేని జీవితం” మూవీని మరోవైపు నుండి ఎన్ని విధాలుగా బిజినెస్ చేసుకోవాలో అన్ని విధాలుగా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులోని భాగంగా “పిల్ల నువ్వులేని జీవితం” శాటిలైట్ రైట్స్ కోసం మూడు ఛానల్స్ ని సంప్రదించారు. మాటివి, జీతెలుగు, జెమిని సంస్థలు “పిల్ల నువ్వులేని జీవితం” మూవీ శాటిలైట్ రైట్స్ పై ఆసక్తి చూపకపోయనా, మాటివి సంస్థలో అల్లుఅరవింద్ కి షేర్స్ ఉన్నాయి కాబట్టి, ఈ మూవీని చివరకు మాటివే కొనుక్కుంది. అయితే కోటి రూపాయలకంటే తక్కువుకే శాటిలైట్ రైట్స్ ని తీసుకున్నట్టుగా మా టీవి సంస్థ నుండి వినిపిస్తున్న టాక్. మొత్తంగా “పిల్ల నువ్వులేని జీవితం” మూవీకి సంబంధించిన బిజినెస్ దాదాపు 12 కోట్ల రూపాయలతో పూర్తైయ్యేవిధంగా ఉందంటూ టాలీవుడ్ లో ట్రేడ్ రిపోర్ట్స్ ని బట్టి తెలుస్తుంది. సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ కి జోష్ ని ఇచ్చిందనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, కామెడీ, మెయిన్ లీడ్ & జగపతి బాబుల పెర్ఫార్మన్స్.. ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజుల సమర్పణలో బన్ని వాసు, హర్షిత్ ల నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: