చెన్నై బ్యూటీ త్రిషకు ఎంగేజ్ మెంట్ జరిగి పోయింది అని కోలీవుడ్ మీడియా నిన్న చేసిన హడావిడికి రంగంలోకి దిగిన త్రిష ఆ వార్తలను ఖండిస్తూ తన ట్విటర్ లో పోస్టింగ్ పెట్టింది. గత రెండు రోజులుగా త్రిష తమిళనాడుకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, నిర్మాత వరుణ్ మనియన్ తో తన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వీరిద్దరి వివాహ నిశ్చితార్ధం కూడా జరిగి పోయిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు విపరీతంగా కనిపించాయి.  ఈ మధ్య కాలంలో రానా త్రిషల బ్రేకప్ వ్యవహారం తరువాత త్రిషకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడం ఇదే మొదటిసారి. అయితే ఈ వార్తలకు త్రిష ఘాటుగా స్పందించింది. తన పెళ్ళి ఎవ్వరితోను నిశ్చయింప బడలేదని, అంతేకాకుండా తన తన జీవితానికి సంబంధించి ఒక ముఖ్య విషయమైన తన పెళ్ళి, ఎంగేజ్ మెంట్ వార్తలను రహస్యంగా ఉంచుకోవలసిన పనిలేదు అంటూ ఈ వార్తలను కొట్టి పారేసింది త్రిష.  అంతేకాదు ప్రస్తుతం తనకు సినిమాలే ప్రపంచం అంటూ లేటెస్ట్ గా బాలయ్యతో నటిస్తున్న కొత్తసినిమాకు సంబంధించి షూటింగ్ కోసం అరకు అందాలను ఆ స్వాదిస్తున్నానని అంటూ క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతానికి త్రిష పెళ్ళి వార్తలు సద్దుమణిగాయి అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: