ఈరోజు భాగ్య నగరంలో అత్యంత విలాస వంతమైన ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతున్న సల్మాన్ సోదరి అర్పిత వివాహం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కోట్లాది రూపాయల ఖర్చుతో జరుగుతున్న ఈ పెళ్ళిలో బాలీవుడ్, టాలీవుడ్ రంగాలకు చెందిన అనేక మంది సెలెబ్రెటీలు ఈ పెళ్ళికి రావడమే కాకుండా దాదాపు ౩౦౦ మంది అతిధులు పాల్గొంటున్న ఈ పెళ్ళి వేడుకలు భారతదేశంలో ఈ మధ్య కాలం జరిగిన అత్యంత విలాస వంతమైన పెళ్ళిళ్ళలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేయబోతోంది. అయితే ఈ పెళ్ళి వేడుకలలో హంగామా అంతా కత్రినాకైఫ్‌ దేనట. ఈ మ్యారేజ్ ప్రస్తావన వచ్చిన దగ్గర నుండి అన్ని విషయాలు కత్రినా దగ్గర ఉండి చూస్తోందని టాక్. ఆఖరికి పెళ్ళి కూతురు అర్పిత మేకప్ విషయంలో కూడా కత్రినా దగ్గర ఉండి తన పర్సనల్ మేకప్‌మేన్‌ చేత మేకప్ చేయిస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. గత శనివారం రాత్రి ముంబైలో జరిగిన సంగీత్ కార్యక్రమంలో ‘షీలాకీ జవానీ’ పాటకు కత్రినా అదిరిపోయే స్టెప్పులేసిందని చెప్పుకుంటున్నారు. ఈరోజు జరగబోయే మ్యారేజ్‌లో కూడా ఈమెదే హడావిడి అని అంటున్నారు. హీరో సల్మాన్‌ఖాన్ అయితే తన సోదరి మ్యారేజ్ ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి చూడటమే కాకుండా వచ్చిన అతిధులకు స్వాగతం పలుకుతూ పెళ్ళి ని ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా సల్మాన్ తన చెల్లి అర్పితకు పెళ్ళి కానుకగా ముంబాయిలోని బాంద్రా ప్రాంతంలో తమ ఇంటికి సమీపంలోని ఓ అధునాతనమైన టెర్రస్ ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ ఫ్లాట్ విలువ సుమారు 17 కోట్లు విలువ ఉంటుందని అంటున్నారు. ఈరోజు జరగబోతున్న సల్మాన్ చెల్లెలు పెళ్ళి ఏర్పాట్లలో సల్మాన్ ప్రియ స్నేహితుడు వెంకటేష్ కూడా చాల ఉత్సాహంగా పాల్గొంటూ సల్మాన్ తో తనకున్న స్నేహాన్ని మరోసారి చాటుతున్నాడు. ఏమైనా ఈమధ్య కాలంలో ఏ సినిమా సెలెబ్రెటీ ఇంటిలో పెళ్ళికి జరగని హడావిడి సల్మాన్ చెల్లి పెళ్ళి విషయంలో కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: