అభిమానులచే యంగ్ టైగర్ అంటూ ముద్దుగా పిలిపించుకునే జూనియర్ ఆ పిలుపు వినగానే పులకరించి పోతాడు. అయితే జూనియర్ కు ఎంతో క్రేజ్ ను పెంచిన ఆ పిలుపు పై కన్నేశాడు సందీప్ కిషన్. గతంలో చిరంజీవితో ‘ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తీసిన నిర్మాత మధు మరొక నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించడమే కాకుండా ఆ సినిమాకు ‘టైగర్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న మంగళవారం ఈ సినిమా షూటింగ్ కాశీలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ ఈచిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు చోటా కె.నాయుడు, సంగీత దర్శకుడు థమన్, మాటల రచయిత అబ్బూరి రవి లాంటి హేమాహేమీలంతా పనిచేస్తూ ఉండటంతో ఈ సినిమా ప్రారంభం నుండి అంచనాలు పెరుగుతున్నాయి. సీరత్ కపూర్ హీరోయిన్ గా సందీప్ తో కలిసి ఈ సినిమాలో రొమాన్స్ చేయబోతోంది గంగానది నేపథ్యంలో సాగే విభిన్న కథాంశoతో రూపొందుతున్న ఈ సినిమా సందీప్ కిషన్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అంటున్నారు. జూనియర్ కు ఎంతో ఇష్టమైన టైగర్ బిరుదును తన సినిమాకు టైటిల్ గా మార్చుకున్న సందీప్ కిషన్ అత్యుత్సాహం ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: