ఒకే సంవత్సరంలో రెండు పరాజయాలు రావడంతో తీవ్ర అబద్రతా భావంతో కాలం గడుపుతున్నాడు మహేష్. అయినా ధైర్యాన్ని తెచ్చుకుని ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేస్తూ వచ్చే సంవత్సరం అయినా తన నుండి ఒక సూపర్ హిట్ రావాలని అతి జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నాడు మహేష్. ఈ నేపధ్యంలో ప్రస్తుతం మహేష్ తన కెరియర్ గురించి బెంగ పెరగడంతో. ఏ విషయంలోను ఎవరిని నమ్మటం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్లు అంటే మహేష్ కు మరీ భయం పట్టుకుందని సెటైర్లు వినపడుతున్నాయి. దీనికి ఉదాహరణ గా ఈమధ్య జరిగిన ఒక సంఘటనను చాలామంది ప్రస్తావిస్తున్నారు. సినిమాలలో నటిస్తూ యాడ్స్ లో నటించడం మహేష్ కు ఎప్పటి నుంచో అలవాటైన విద్య. అయితే ఇటీవల ఒక యాడ్ డైరెక్టర్ ను మహేష్ అవమానపరిచాడు అనే వార్తలు వస్తున్నాయి. వివరాలలోకి వెళితే భాగ్యనగరంలో పేరుగాంచిన ‘రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్’ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హాస్పటల్ కు సంబంధించి ఒక లేటెస్ట్ యాడ్ ను ఒక ప్రముఖ యాడ్ డైరెక్టర్ తో మహేష్ ను పెట్టి ఆ హాస్పటల్ యాజమాన్యం ఇటీవల చిత్రీకరించింది. అయితే యాడ్ చిత్రీకరణ అంతా పూర్తి అయిన తరువాత ఆ యాడ్ క్వాలిటీ మహేష్ కు నచ్చక పోవడంతో ఆ యాడ్ డైరెక్టర్ ను తొలగించి మరొక డైరెక్టర్ చేత షూట్ చేయిద్దామని మహేష్ సూచించాడట. అయితే ఎన్నో యాడ్స్ చిత్రీకరించిన తన సామర్ధ్యం పై మహేష్ అజమాయిషీ ఏమిటి అని ఆ యంగ్ డైరెక్టర్ ప్రశ్నిస్తున్నా వినకుండా అతడిని తొలగించి మహేష్ కోరిక పై త్రివిక్రమ్ ను తీసుకు వచ్చి మహేష్ కు నచ్చే విధంగా రీ షూట్ చేయించారని సమాచారం. ఇక్కడితో ఈకథ సుఖాంతంగా ముగిసినా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని సన్నివేశాల చిత్రీకరాణ మహేష్ కు నచ్చకపోతే తిరిగి అక్కడ కూడా త్రివిక్రమ్ రంగ ప్రవేశం చేసి ఆ సీన్స్ ను కూడా త్రివిక్రమ్ రీ షూట్ చేస్తాడేమో అంటూ మహేష్ త్రివిక్రమ్ లపై సెటైర్లు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: