కొంత గ్యాప్ తరువాత మంచు లక్ష్మి మేకప్ వేసుకుని ‘పిలవని పేరంటం’ అంటూ నిన్న కెమెరా ముందుకు వచ్చి ఆ సినిమా ఫస్ట్ షాట్ లో నటించింది. మంచు వారి అమ్మాయికి ధన్ రాజ్ కు మధ్య జరిగే సన్నివేశాన్ని మొదటి సీన్ గా రాఘవేంద్రరావు క్లాప్ ఇస్తే దర్శకుడు చిత్రీకరణ కూడా పూర్తి చేసాడు. ఆ తరువాత ఈ వార్తలు మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని తెల్లవారే సరికి ఈ సినిమా నుండి మంచు లక్ష్మి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అనునిత్యం వెబ్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచులక్ష్మి పై ఆమె అభిమానులు వేసిన సెటైర్లు అని అంటున్నారు. మంచువారి అమ్మాయిగా, మంచి నటిగా పేరుగాంచిన తమ అభిమాని నటి ఒక చిన్న కమెడియన్ తో కలిసి ఇలా నటించడం ఏమిటి అని కామెంట్ చేస్తూ కొందరు వెబ్ మీడియాలో పెట్టిన కామెంట్లకు బాధపడి మంచులక్ష్మి ఈ సినిమా నుండి తప్పుకుంది అనే గాసిప్పులు వినపడుతున్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో నటిస్తున్న కమెడియన్ ధనరాజ్ తాను ఈ సినిమాలో హీరోని అని మీడియాతో కామెంట్ చేయడం కూడా మంచులక్ష్మికి కోపం తెప్పించినట్లు టాక్. ఏది ఎలా ఉన్నా ఈ వార్తలే నిజం అయితే చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న ధనరాజ్ నటిస్తున్న సినిమాకు ఆదిలోనే అడ్డంకులు ఎదురౌడం షాకింగ్ గా మారింది. మరి ఈ సినిమాను ధన్ రాజ్ లేకుండా తీస్తారా? లేదంటే ఈ వ్యవహారానికి రాజీ కుదిర్చి తిరిగి మంచులక్ష్మి ధన్ రాజ్ కాంబినేషన్ లోనే ఈ సినిమాను కొనసాగిస్తారా ? అనే విషయం పై రానున్న రోజులలో క్లారిటీ వచ్చే అవకశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: