స్టార్ డం ఉన్నప్పుడే మనీను సంపాదించుకోవాలన్నది నేటి తరం ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల రూల్. అలాగే ఫాంలో ఉన్నప్పుడే ఎండోర్స్ మెంట్ వద్ద నుండి కోట్ల రూపాయలు తీసుకోవాలన్నది నేటి తరం క్రీడాకారుల గోల్. దీంతో ఎవరికి వారే, తోచిన విధంగా స్టార్ సెలబ్రిటీలు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ తరహా డిమాండ్ చేసిన వారు చాలానే మంది ఉన్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాది అమ్మాయి, సానియా మీర్జా చేరుకుంది. గతంలో సానిమా మీర్జా ఎండోర్స్ మెంట్ కోసం కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ పై సంతం చేసి ఉండొచ్చు. కాని ఇప్పుడు ఆదే రేంజ్ లో తొలిసారిగా తను హోస్ట్ గా మారుతున్న ఓ టెలివిజన్ షో కి, భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ని తీసుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా జేమ్స్ బాండ్ సంబంధించిన టీ.వి షో కావడం మరింత ఎట్రాక్షన్ గా మారింది. త్వరలో సోనీ పిక్స్ ఛానల్‌లో ప్రసారం కాబోయే ‘స్కూల్ అఫ్ బాండింగ్’ కార్యక్రమానికి సానియామీర్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. ఈ ప్రోగ్రాం టీజర్ తాజాగా విడుదలయింది. 60 సెకన్ల ఈ ప్రోమోలో తన నటన, ఆహార్యంతో సానియా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. జేమ్స్ బాండ్ చిత్రాలకు సంబందించిన విశేషాలను ఈ కార్యక్రమంలో రివీల్ చేయనున్నారు. వారి స్టైల్ తీరు గురించి చర్చించనున్నారు. ‘ఎలా మొదలుపెట్టాం అనేది ముఖ్యం కాదు, ఎలా ముగించాం అనేది ముఖ్యం’ అంటూ సానియా ఇంగ్లీష్‌లో చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ షోకి హోస్ట్ గా చేయటం కోసం సానియా మీర్జా ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: