మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొత్త హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ నటించిన తొలిచిత్రం రేయ్ మూవీ అయినప్పటికీ, తను నటించిన రెండో చిత్రం, ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటగా రిలీజ్ అయి, ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. దీంతో సాయి ధరమ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రి దాదాపు సక్సెస్ అయినట్టే. త్వరలోనే ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మెగా హీరోల అందరికి బాక్సాపీస్ గుండెగా చెప్పుకునే నైజాం మార్కెట్ లో ఈ నయా హీరో కూడ తన సత్తా చాటాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ మూవీకి సంబంధించిన నైజాం మార్కెట్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. ‘పిల్లా నువ్వులేని జీవితం’ విడుదలైన అన్ని చోట్ల నుండి, మంచి స్పందనని అందుకుంటూ విజయపధాన దూసుకుపోతుంది. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం, ఈ సినిమా నైజాంలో రెండు కోట్ల 40లక్షలను సాధించింది. ఇదంతా 6రోజుల మార్కెట్ వివరాలు. ఓ రకంగా చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ కి ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటే, దానికి కారణం కేవలం మెగా ఫ్యాన్స్, అలాగే సినీ ప్రేక్షకుల ఆధరణ మాత్రమే. ప్రస్తుతం అన్ని సెంటర్స్ నుండి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తుండటంతో, తను మొదటి సారిగా నటించిన రేయ్ మూవీని త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సాయి సరసన రెజినా కాసేండ్రా హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు ముఖ్యపాత్ర పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: