త్వరలో విడుదల కాబోతున్న ‘లింగ’ సినిమాకు దాదాపు 35 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్న రజనీకాంత్ తన ఆస్థులను అమ్ముతున్నాడు అంటే ఎవ్వరూ నమ్మలేని విషయం. అయితే సూపర్ స్టార్ రజినీ భాగ్యనగరంలో అత్యంత విలువైన ప్రాంతంలో ఉన్న ఒక స్థలాన్ని అమ్మకానికి పెట్టినట్లుగా ఫిలింనగర్ లో గాసిప్పులు వినపడుతున్నాయి. ఈ విషయమై వినిపిస్తున్న వార్తల ప్రకారం రజినీకాంత్ భాగ్యనరానికి చెందిన ఒక ప్రముఖ సినిమా ఫైనాన్షియర్ కు 8 కోట్ల వరకు బాకీ పడ్డాడని టాక్. రజినీ కుమార్తె సౌందర్య తీసిన ‘కొచ్చాడియన్’ నిమిత్తం రజినీ ఈ అప్పుచేసాడు అనే వార్తలు ఉన్నాయి. దీనితో రజినీ ఆ ఆర్ధిక వ్యవహారం క్లియర్ చేయడానికి హైదరాబాద్ లోని తన స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు అని కొందరు వార్తలు పుట్టిస్తున్నారు. అయితే ఈ విషయంలో మరొక కథనం కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు జిల్లాలో ఏర్పడుతూ ఉండటంతో రజినీ కొన్ని స్థలాలు ఇప్పటికే ఆ ప్రాంతాలలో కొన్నాడని దానికోసమే రజినీ ఈ ఆస్తులను అమ్ముతున్నట్లు మరికొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా తన ఆస్థులను ఒక సినిమా కలిగించిన నష్టం వల్ల అమ్ముతున్నాడు అని వార్తలు వస్తూ ఉండటం బట్టి భారీ బడ్జెట్ తో సినిమాలు తీసిన నిర్మాతల పరిస్థితి ప్రస్థుతం ఎలా ఉన్నదో ఎవరికైనా అర్ధం అవుతుంది.  అందుకే కాబోలు రజినీ గత ఆది వారం చెన్నైలో జరిగిన ‘లింగ’ ఫంక్షన్ లో తనకు డబ్బు ఉంది కదా అని తన కుమార్తె వృథ చేయనక్కరలేదు కదా అంటూ తన కూతురు పైనే సెటైర్లు వేసాడు రజినీకాంత్..

మరింత సమాచారం తెలుసుకోండి: