పవన్ కల్యాణ్ తో 'పులి' సినిమాలో నటించి టాలీవుడ్ లో తన హవా చాటుదామని ప్రయత్నించిన నికేషా పటేల్ ఆ సినిమా పరాజయంతో తన రూట్ మార్చుకుని ప్రస్తుతం తమిళ కన్నడ భాషలలో సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడంలో 'ఆలోనే' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గుర్రపు స్వారీ చేయాల్సిన సన్నివేశాలు చాల ఉండటంతో ఆ సీన్స్ లో నటిస్తూ ప్రమాద వశాత్తు గుర్రం పై అదుపుతప్పి కింద పడిపోవడంతో ఈమెకు గట్టి దెబ్బలు తగిలాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను సమంత అభిమానులు సమంత దృష్టికి తీసుకు వెడుతూ ఆమె పై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తునారు. ప్రస్తుతం సమంత అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఆమె నటిస్తున్న పాత్ర స్వభావం రీత్యా గుర్రపు స్వారీని నేర్చుకుంటున్నానని ఈమధ్యనే తన అభిమానులకు ఆనందంగా తెలియచేసింది ఈ క్యూట్ హీరోయిన్.  అయితే పవన్ హీరోయిన్ నికేషా పటేల్ సంఘటనను సమంత దృష్టికి తీసుకు వెళుతూ సమంత వీరాభిమానులు ‘సమంత నీకెందుకు ఇంత సాహసం నీవు చెప్పినట్లు వినడానికి గుర్రాలు హీరోలు కాదుగా’ అంటూ జోక్ చేస్తూ సమంత పై సెటైర్లు వేస్తున్నారు. అసలే తన అందం ఎక్కడ తరిగి పోతుందో అని జిమ్ములకు వెళ్ళడానికి కూడా భయపడుతున్న సమంతను ఈ గుర్రాల గోల టార్చర్ గానే మారుతోంది అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: